క్రికెట్లో వికెట్ల చరిత్ర తెలుసా..?
గెలిచిన జట్టు వికెట్లను తీసుకెళ్లడం.. మ్యాచ్ ముగిశాక గెలిచిన జట్టు కెప్టెన్ లేదా ఆటగాళ్లు స్టంప్స్లో నుంచి ఓ వికెట్ను తీసుకెళ్లడం మీరు చూసే ఉంటారు. కానీ అలా వికెట్ ఎందుకు తీసుకెళ్తారో తెలుసా..? ఆ మ్యాచ్ గెలుపును గుర్తుంచడం కోసం. అవును మ్యాచ్లో తమ గెలుపునకు గుర్తుగా ఆ వికెట్ను కెప్టెన్ తన వద్ద ఉంచుకుంటాడు. ఇక వారు వికెట్ తీసుకెళ్లేటప్పుడు కచ్చితంగా మధ్య వికెట్ను వదిలి రెండు వైపులా ఉన్న వికెట్లను మాత్రమే తీసుకెళ్తారు. అది ఎందుకో తెలుసా..? మధ్య వికెట్లో కెమెరాలు, మైక్లు అన్నీ అమర్చి ఉంటాయి. వాటి వైర్లు పిచ్ గుండా వెళ్లి టెక్నికల్ రూం వరకు ఉంటాయి. ఈ కారణంగానే ఎవరూ మధ్య వికెట్ను ముట్టుకోరు. 2014లో వచ్చిన జింగ్ వికెట్స్(బంతి టచ్ కాగానే వెలిగే స్టంప్స్) వచ్చినప్పటి నుంచి ఆటగాళ్లు అలా వికెట్ల తీసుకెళ్లడాన్ని కూడా నిషేధించారు. ఎందుకంటే సాధారణ వికెట్ల ఖరీదు కంటే ఈ వికెట్ల ఖరీదు చాలా ఎక్కువ. ఒక్కో సెట్ ఖరీదు దాదాపు రూ.50 వేల వరకు ఉంటుంది. అందుకే వీటిని తీసుకెళ్లడానికి అనుమతించరు. అయితే ప్రపంచకప్ వంటి పెద్ద పెద్ద టోర్నీల్లో ఫైనల్ గెలిచిన జట్టుకు మాత్రం వీటిని తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. కానీ అందుకోసం ముందస్తుగా అనుమతి తీసుకోవల్సి ఉంటుంది.